ఈసారి ఎలాగైనా విజయం సాధించి ఏపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే పవన్ ఏరికోరి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అయితే పవన్ కల్యాణ్ గెలుపుపై ఏపీ అంతటా జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. కచ్చితంగా గెలుస్తాడని ఒక పందెం.. గెలిస్తే మెజారిటీ ఎంత? 50వేలు వస్తుందా? 75వేలు వస్తుందా? లక్ష మెజారిటీ వస్తుందా? ప్రధానంగా వీటిపైనే బెట్టింగ్ నడుస్తోంది. పవన్ గెలుపుపై రూపాయికి 30 రూపాయల చొప్పున బెట్టింగ్ నడుస్తోంది.