వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్‌కు బిగ్ షాక్

వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు బిగ్ షాక్ తగిలింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అమర్నాథ్‌కు నోటీసులు ఇచ్చారు. గాజువాక చట్టివానిపాలెం సర్వే నంబర్ 79/9aలో అనుమతి లేకుండా 4 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదుతో జీవీఎంసీ అధికారులు నోటీసులిచ్చారు.

సంబంధిత పోస్ట్