AP: సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్ విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగ్గా.. పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కావాలని నిందితుడి తరఫు లాయర్ కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.