కుప్పంలో కూటమి విజయోత్సవ ర్యాలీ

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఘన విజయం సాధించడం, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కుప్పంలో బుధవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో డిక్లరేషన్ పత్రానికి పూజలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ర్యాలీ చేశారు.

సంబంధిత పోస్ట్