కుప్పం ఆర్టీసీ డిపోకు త్వరలో కొత్త బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఆర్ ఎం జితేంద్రనాథ్ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు. డిపోలో బస్సుల స్థితిగతులను పరిశీలించామని, అతి త్వరలో 40 బస్సులతో కుప్పం ప్రయాణికులకు మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త బస్టాండు నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.