తెలుగువాళ్లంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. హైఓల్టేజ్ ఎన్నికలుగా చెబుతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాత్రం ఇందుకు విరుద్ధమైన రీతిలో వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ నిట్టనిలువుగా చీలినట్లు కనిపించింది. కొన్ని సంస్థలు అధికార వైసీపీకి అధికారం ఖాయమన్న రీతిలో తమ ఎగ్జిట్ ఫలితాల్ని వెల్లడిస్తే.. అదే స్థాయిలో టీడీపీ.. జనసేన.. బీజేపీ కూటమిదే గెలుపు ధీమాను వ్యక్తం చేశాయి. అయితే ప్రతి ఎగ్జిట్ పోల్లో మాత్రం జనసేనాని పవన్ కల్యాణ్ గెలుపు ఖాయమని స్పష్టంచేశారు.