ఏపీలో కూటమి ఘన విజయంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి అనుమానాలున్నాయని చెప్పారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానించారు. పలువురు నేతలు, పలు సర్వేలు కూటమికి 160 సీట్లు వస్తాయని చెప్పారని గుర్తుచేశారు. ప్రజలు ఓటు వేసే వరకు బయటపడలేదని, మరి వీరికి మాత్రం ఎన్ని సీట్లు వస్తాయో ఎలా తెలిసిందని అనుమానం వ్యక్తం చేశారు. సెలెక్ట్డ్ ప్లేస్లలో ట్యాంపరింగ్ చేసినట్లు ఆరోపించారు.