రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. ఎన్డీయేలో టీడీపీ చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖ రాశారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమని లేఖలో పేర్కొన్నారు. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనని తెలిపారు.