జనసేనాని పవన్ కల్యాణ్పై కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య ఫైర్ అయ్యారు. "టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు మాత్రమే ఇవ్వడమేంటి. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. ఒకరు ఇవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదు. జనసేన పరిస్థితి అంత హీనంగా ఉందా? పొత్తు ధర్మంలో భాగంగా పవన్ రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలి. చెరిసగం మంత్రి పదవులు దక్కాలి." అని పేర్కొంటూ పవన్కు ఆయన లేఖ రాశారు.