ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.