వేసవి సెలవుల సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర విద్యాశాఖ 'సెలవుల్లో సరదాగా-2024' కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ క్రమంలో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల కోసం వేసవి కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలను ఆదేశించింది. ఇక విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించడానికి టీచర్లు, హెడ్మాస్టర్లు 'వుయ్ లవ్ రీడింగ్' పోటీలు నిర్వహించాలని స్పష్టం చేసింది.