ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాన్ లోకల్ అని, ఎన్నికలు అయిపోగానే హైదరాబాద్ వెళ్లిపోతారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో వస్తున్నారని వ్యాఖ్యానించారు.