టీడీపీలో చేరిన హుసేనాపురం వైసీపీ నాయకులు

బనగానపల్లె మండలంలోని హుసేనాపురం కు చెందిన పలువురు వైసీపీ నాయకులు బుధవారం టీడీపీలో చేరారు. టీడీపీ నాయకులు షేక్ జహంగీర్ బాషా, షేక్ మహబూబ్ బాషాల ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన గడ్డం జాఫర్ హుసేన్, నూర్అహమ్మద్, మహమ్మద్ రఫీ, ముల్లాసలాం, తదితరులు టీడీపీలో చేరారు. వీరికి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన నేతలకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్