'ఏపీలో ఆగని దాడులు.. నడిరోడ్డుపై కత్తిపోట్లు'

ఏపీలో రాజకీయ దాడులు ఆగడం లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నూజివీడులో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. నూజివీడు పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నడిరోడ్డుపై టీడీపీ నేత కత్తులతో హాల్ చల్ చేశాడు. ఓ వ్యక్తిపై అందరు చూస్తుండగానే కత్తితో దాడికి దిగాడు. ప్రస్తుతం ఈ వీడియోను వైసీపీ ట్వీట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్