గ్రామీణ ప్రాంతాలలో నీటి నాణ్యత పరీక్షించి ప్రజలకు సురక్షిత నీటిని సరఫరా చేసేందుకు నీటి పరీక్ష కిట్లను పంపిణీ చేసినట్లు కొమరాడ మండల నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారి నవీన్ కుమార్ శనివారం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూతనంగా కిట్లను సచివాలయ ఇంజినీరింగ్ సహాయకులకు అందించినట్లు ఆయన తెలిపారు. 2026 వరకు నాణ్యతలు పరీక్షలు ఉపయోగించే రసాయనాలకు గడువు ఉన్నట్లు ఆయన తెలిపారు.