AP: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపారు. కాగా అనుమతి లేకుండా నిర్మిస్తున్నారంటూ 16 వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటిసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని నోటిసుల్లో పేర్కొన్నారు.