ఇందుకూరుపేటలో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం

ఇందుకూరుపేట మండలంలో గురువారం రాత్రి వైసిపి జిల్లా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పొందిన సంక్షేమం, అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్