వైసీపీలో చేరిన వాలంటీర్లు

ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరులో గురువారం దాదాపుగా 20 మంది వాలంటీర్లు వైసీపీలో చేరారు. వాలంటీర్ల పదవికి రాజీనామా చేసి చేరడం జరిగింది. వారికి జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి విజయం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్