AP: వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 18న రైతులకు అందించే పీఎం కిసాన్ నగదు పంపిణీతో పాటు ఖరీఫ్ సీజన్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. విత్తనాలు, ఎరువుల కొరత రానివ్వకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని సూచించారు.