విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తులో వేగం పెంచింది. అన్ని కోణాల్లో విచారణ చేపడుతోంది. ఈ మేరకు డ్రగ్స్ శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించింది. అయితే సీజ్ చేసిన కంటెయినర్ ప్రస్తుతం విశాఖ కంటెయినర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జామినేషన్ పాయింట్లోనే ఉంది. మొదట కంటెయినర్ను ఇతర ప్రదేశానికి తరలించాలని భావించారు. కానీ సీబీఐ మరికొన్ని రోజుల పాటు కంటెయినర్ను అక్కడే ఉంచాలని నిర్ణయించింది.