విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. "ప్రధాని మోదీ విశాఖ వచ్చినప్పుడు ప్లాంట్ ప్రైవేటీకరణ చెయొద్దని ఆయనకు సీఎం జగన్ చెప్పారు. కానీ, ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోంది. ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీతో టీడీపీ నేతలు ఎలా జత కడతారు. ప్రైవేటీకరణ చెయ్యబోమని కుటమి నేతలు ధైర్యంగా చెప్పగలరా?" అని బొత్స ప్రశ్నించారు.