గత ప్రభుత్వం హయాంలో లంచాల పాలన ఉండేదని, జన్మభూమి కమిటీలదే రాజ్యమని సీఎం జగన్ విమర్శించారు. గత ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి తేడా గమనించండని ఓటర్లను కోరారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం చేసి చూపిస్తున్నామని చెప్పారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం ఇస్తున్నామని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలిలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం ఈ మేరకు మాట్లాడారు.