మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుక్రవారం పీవీ సింధు థాయిలాండ్ ప్లేయర్ సుపనిద కేటితాంగ్ చేతిలో క్వార్టర్స్ మ్యాచ్లో ఓటమిపాలైంది. అయితే ఓటమి తట్టుకోలేక సింధు తన చేతుల్లో ఉన్న రాకెట్ను నేలకు కొట్టింది. ప్రవర్తన సరిగా లేని కారణంగా అంపైర్ సింధుకు ఎల్లో కార్డు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.