AP: తాజా ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ చేసిన ప్రచారంపై టీడీపీ సెటైర్లు వేసింది. జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వైసీపీ చేసిన పోస్టును ట్విట్టర్లో పంచుకుంది. "ఎక్కడికి రావాలో చెప్తే మేము కూడా వస్తాం జగన్. అసలే బస్సు, రైలు, ఫ్లైట్ టికెట్లు దొరకటం లేదు. హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయని బులుగు మీడియా చెప్పింది." అంటూ టీడీపీ రాసుకొచ్చింది.