AP: ఓటమి ఖాయమని తెలిసే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. "వైజాగ్లో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. టీడీపీకి ఓటు వేశారని దాడి చేయడం దుర్మార్గం. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారు. ఇది మహిళలపై జరిగిన దాడి కాదు.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి." అని లోకేశ్ వ్యాఖ్యానించారు.