ఉత్తరప్రదేశ్ జైలులో మరో 36 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకింది. దాంతో హెచ్ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య 47కు చేరింది. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు ఎయిడ్స్ సోకిన రోగులకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 2023 డిసెంబర్లో లక్నో జైలులోని ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలుత 11 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాజాగా మరో 36 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకింది.