ఇవాళ సాయంత్రం భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇప్పుడు భారత్ ఫామ్ను చూస్తే పాక్పై విజయం సాధించే అవకాశాలు 60 శాతం ఉన్నాయి. అత్యుత్తమ జట్టే తప్పకుండా గెలుస్తుంది. భారత్కు 60.. పాక్కు 40 శాతం అవకాశం ఉందని గట్టిగా చెబుతున్నా. ఇది టీ20 మ్యాచ్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఏ క్షణంలోనైనా మ్యాచ్ ఫలితం మారే అవకాశాలు ఉంటాయి’’ అని తెలిపాడు.