గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పశు గణాభివృద్ధి సంస్థ సీఐవో రాంచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎస్డీ కల్యాణ్ను విచారించిన అనంతరం రూ.700 కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అంచనాకు వచ్చింది. తొలుత సుమారు రూ.2 కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే 10 మంది నిందితులను గుర్తించగా, ఆరుగురిని అరెస్టు చేశారు.