భారీ వర్షానికి రోడ్డుపై నిలిచిన నీటిలో ఓ వ్యక్తి పరుపుపై తేలియాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని పూణేలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. నీటితో నిండిన రోడ్డుపై ఒక వ్యక్తి పరుపుపై తేలుతూ వెళ్లాడు. కొన్ని వాహనాలు కూడా దాని పక్కగా వెళ్లాయి. ఇక దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఫన్నీగా కామెంట్ చేశారు.