వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన శవం..10 రోజులుగా ఆ నీళ్లే తాగిన జనం

నల్గొండలో దారుణ ఘటన జరిగింది. నల్గొండలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించడం కలకలం రేపింది. మృతదేహం హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. రొటీన్‌ తనిఖీల్లో భాగంగా అధికారులు నీళ్లు చెక్‌ చేసేందుకు వెళ్లగా అందులో శవం కనిపించింది. అయితే తమకు తెలియకుండానే గత 10 రోజులుగా కుళ్లిన శవం ఉన్న నీళ్లు తాగామా అని స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్