ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో తాజాగా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పింకీ జైస్వాల్ (34) అనే యువతి.. 24వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.