గోవా తరహాలోనే హైదరాబాద్ నగరంలో కూడా డేటింగ్ స్కామ్స్ జరుగుతున్నాయి. యువకులకు డేటింగ్ యాప్లో పరిచయమవుతున్న యువతులు.. వారిని హైటెక్ సిటీలోని ఓ పబ్కి తీసుకువెళ్తున్నారు. అక్కడ ఖరీదైన మద్యం, ఫుడ్ ఆర్డర్ చేయడం ద్వారా వేలల్లో బిల్లు చేసి యువతులు జారుకుంటున్నారు. బిల్ కట్టాలని యువకులపై పబ్ యాజమాన్యం యువకులపై ఒత్తిడి తెస్తోంది. ఇప్పటి వరకూ 8 మంది బాధితులుగా మారినట్లు తెలుస్తోంది.