ఈ సంవత్సరం జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఆలయ బోర్డు తాజాగా ప్రకటించింది. 52 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఆసక్తి గల భక్తులు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. 13-70 ఏళ్ల వారినే యాత్రకు అనుమతిస్తారు. మరిన్ని వివరాలకు www.jksab.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.