విపక్ష ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ సహా విపక్షాలు తమ ఓటు బ్యాంకు గురించి కలత చెందుతున్నాయని, బీజేపీ ఏ ఒక్కరికీ భయపడదని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి గెలిస్తే వారి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. వంతుల వారీగా తమ నేతలు ఏడాదికి ఒకరు చొప్పున ప్రధానమంత్రి బాధ్యతలు చేపడతారని విపక్ష నేత ఒకరు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.