ఇటీవల బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లకు సంబంధించి నిందితుడైన ముజ్మిల్ షరీఫ్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. కుట్రపూరితంగానే ఈ పేలుడు జరిగిందని ఎన్ఐఏ పేర్కొంది. అతడి నుంచి నగదు, పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. మరో ఇద్దరు నిందితులు సాజిబ్, అబ్దుల్ కోసం NIA తీవ్రంగా గాలిస్తోంది.