భారతీయ మొబైల్ నంబర్లతో వచ్చే అన్ని అంతర్జాతీయ నకిలీ కాల్స్ ను బ్లాక్ చేయాలని టెలికాం ఆపరేటర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశీయ పౌరులకు స్థానిక నంబర్లతో మోసగాళ్లు అంతర్జాతీయ కాల్స్ చేస్తూ సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు టెలికాం విభాగం తెలిపింది. కాలింగ్ లైన్ గుర్తింపుని మార్చడం ద్వారా విదేశాల్లోని సైబర్ నేరస్థులు ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.