వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. పూణేలోని కార్వే నగర్లోని పీకే బిర్యానీ హౌస్ నుంచి పనీర్ బిర్యానీ తెప్పించుకున్నాడు పంకజ్ శుక్లా అనే వ్యక్తి. అయితే, సగం తిన్నాక అందులో చికెన్ ముక్క కనపడింది. దీంతో ఈ విషయం కంపెనీకి తెలిపి రీఫండ్ తీసుకున్నాడు. అయినప్పటికీ తాను శాకాహారి కావడంతో తన మనోభావాలను దెబ్బతీసిందని చెప్పాడు. దీనిపై జొమాటో స్పందిస్తూ ఆర్డర్ వివరాలు పంపితే దాన్ని చెక్ చేస్తామని పేర్కొంది.