రంగారెడ్డి మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

నీటి పారుదల ప్రాజెక్టుల సలహాదారుడు, రిటైర్డ్ ఎస్ఈఎన్ రంగారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. ఇరిగేషన్ విభాగానికి ఆయన అందించిన సలహాలు, సూచనలు విలువైనవని అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్