మోడీ తబలా వాయిస్తారా?: రబ్రీదేవి

62చూసినవారు
మోడీ తబలా వాయిస్తారా?: రబ్రీదేవి
ముస్లిముల ఓట్ల కోసం ప్రతిపక్ష పార్టీలు ముజ్రా చేస్తున్నాయన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి స్పందించారు. ప్రతిపక్ష పార్టీలు ముజ్రా చేస్తే, మోడీ తబలా వాయిస్తారా అని ప్రశ్నించారు. పాట్నాలో ఆమె మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA చిత్తుగా ఓడుతుందని వ్యాఖ్యానించారు. పాక్ నుంచి ప్రతిపక్షాలకు మద్దతు లభిస్తోందన్న మోడీ వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు.

సంబంధిత పోస్ట్