మెదక్ జిల్లా కొల్చారంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్, BRS మధ్య వాగ్వాదం జరిగింది. ఎలాంటి అధికారం లేనివారు వేదికపై ఉన్నారని ఎమ్మెల్యే సునీతా రెడ్డి ప్రశ్నించారు. స్థానిక ఎంపీటీసీ, అధికారులను వేదికపై ఆహ్వానించలేదని నిలదీశారు. దీంతో మంత్రి కొండా సురేఖ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని వెనుదిరిగారు.