ఒకవైపు డీఈవోలు పదోన్నతుల జాబితాను పరిశీలిస్తుండగా.. మరోవైపు టెట్ విషయంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో పదోన్నతులపై విద్యాశాఖ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న విషయమై ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఆదేశాలు అందాక వాటిలో ఏముందో చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెప్పారు. భాషా పండితులు, పీఈటీలకు టెట్ తప్పనిసరని న్యాయస్థానం తీర్పు ఇస్తే అప్పుడు వారి వరకు ఏం చేయాలనేది ఆలోచిస్తామన్నారు.