ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్కు చెందిన బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ కుమారుడు, బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్ వాహనం ఢీకొని నలుగురు యువకులు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మైనర్ యువకులు మృతిచెందగా.. మరో ఇద్దరు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.