మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో కర్ణాటకలోని JDS ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టులో షాక్ తగిలింది. వైద్య పరీక్షల తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ప్రజ్వల్ రేవణ్ణను కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. బెయిల్ మంజూరు చేయాలని రేవణ్ణ తరఫు న్యాయవాది అరుణ్ కోరగా కోర్టు నిరాకరించింది. జూన్ 6 వరకు ఆయనను సిట్ కస్టడీకి అప్పగిస్తూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.