హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నీట్లో అక్రమాలు జరిగాయని BJP ఆఫీస్ ముందు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో వారికి BJP కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. బీజేపీ, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు పరస్పర వ్యతిరేక నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.