కాంగ్రెస్లో చేరికపై ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ క్లారిటీ ఇచ్చారు. తనపై జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవమని కొట్టిపారేశారు. కాంగ్రెస్లో చేరి సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నానని కూడా తనపై ప్రచారం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం తనకు ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని, నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ ను కలిసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని వెల్లడించారు.