కర్ణాటకను ఏటీఎం చేసుకున్నారు: మోదీ

72చూసినవారు
కర్ణాటకను ఏటీఎం చేసుకున్నారు: మోదీ
కర్ణాటకను కాంగ్రెస్ కుటుంబం ఏటీఎంగా మార్చిందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని, కాంగ్రెస్ దోపిడీ నుంచి కర్ణాటకను కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కర్ణాటక రాష్ట్రం కలబురగిలోని ఎన్వీ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి కర్ణాటక నుంచి ఖాతా తెరిచే అవకాశం కాంగ్రెస్‌కు ఇవ్వబోమని ప్రజలకు భరోసా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్