ఎలక్టోరల్ బాండ్స్ అతిపెద్ద కుంభకోణం: రాహుల్ గాంధీ

70చూసినవారు
ఎలక్టోరల్ బాండ్స్ అతిపెద్ద కుంభకోణం: రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్లను ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీగా పేర్కొంటారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధులతో బీజేపీ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంట్రాక్టులకు, ఎలక్టోరల్ బాండ్లకు ఎలాంటి సంబంధం లేదని రాహుల్ అన్నారు. దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని రాహుల్ మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్