పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్రం రైతులకు ఏటా రూ.6000 అందజేస్తుంది. అలాగే.. తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రైతుబంధు ద్వారా రూ.10 వేలు అందిస్తోంది. ఇక వానాకాలం సీజన్ నుంచి రైతుభరోసా పేరుమీద కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15వేలు అందించనుంది. అంటే ఏటా రైతుల ఖాతాలో మొత్తం రూ.21వేలు జమ కానున్నాయి. అయితే జూన్ లో PM కిసాన్ నిధులు రూ.2 వేలు, టిఎస్ ప్రభుత్వం వేసే డబ్బులు రూ.7500తో రైతులకు ఒకేసారి రూ.9500 పెట్టుబడి సాయం కింద అందనుంది.