KCRపై ఈడీ కేసు నమోదు: రఘునందన్ రావు

మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలుచేశారు. కాసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని, కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని తెలిపారు. గోర్రెల స్కామ్ కేసులో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామి రెడ్డిలకు ముందుంది ముసళ్ల పండుగ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్