గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల వ్యవహారంపై ఈడీ దూకుడు పెంచింది. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఆరా తీసింది. గొర్రెల పంపిణీలో అవకతవకలపై వివరాలు ఇవ్వాలని ఆ శాఖ ఎండీకి లేఖ రాసింది.